మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ శుక్రవారం రాజోలు నుండి కేసీ కెనాల్ కు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రైతుల కల రాజోలు ఆనకట్ట నిర్మాణం పూర్తిచేసేందుకు కృషి చేస్తానని అన్నారు. 1380 కోట్లతో టెండర్లు పూర్తి అయ్యాయని, ఎమ్మెల్యేగా గెలవడం కేసీ కాలువకు నీరు వదలడం అదృష్టంగా భావిస్తున్నానని, రైతులకు రాజోలు ఆనకట్ట నిర్మించి ఇవ్వడం మే నా ఆశయం అన్నారు.