వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి, గాంధీ రోడ్డులోని ఓ లాడ్జిలో కొంతమంది రూమ్ తీసుకుని ఉంటున్నారు. అయితే, వీరి మధ్య గొడవ జరిగినట్లు లాడ్జి సిబ్బంది చెబుతున్నారు. సోమవారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహం లాడ్జిలో కనిపించడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మద్యం సీసాతో యువకుడి తలపై కొట్టి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.