ప్రొద్దుటూరు పరిధిలోని మైలవరం కెనాల్ ఆక్రమణలను తొలగించాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ఆదివారం ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కాలువపై నివసిస్తున్న ప్రజలు కలిశారు. తమకు కొన్ని రోజులు సమయం ఇవ్వాలని వారు కోరారు. మైలవరం కెనాల్ ఆక్రమణలు తొలగించి కాలువను మరమ్మతులు చేసేందుకు త్వరలో పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.