ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామ ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో విగ్రహం పాక్షికంగా దెబ్బతింది. ఆదివారం ఈ విషయం తెలియడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ బాల మద్దిలేటి విచారణ చేపట్టారు. ఎవరైనా ఆకతాయిలు ఈ పని చేశారా, లేక కావాలనే ఎవరైనా చేశారా అనే కోణంలో విచారిస్తున్నామని సీఐ తెలిపారు.