రైల్వే కోడూరు: పూలేకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

60చూసినవారు
రైల్వే కోడూరు: పూలేకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే
మహాత్మ జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా గురువారం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మ పూలే ఆశయ సాధన కోసం అందరూ పని చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిసి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యనమల మహేష్, ఎంపీటీసీ లత పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you