70 లక్షల వ్యయంతో బుడిగుంటపల్లి నుండి దేశెట్టిపల్లి గ్రామం వరకు సిమెంట్ రోడ్డు మరియు తారురోడ్డు నిర్మాణానికి ఇంచార్జ్ మరియు తూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ శనివారం భూమి పూజ చేశారు. ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామానికి సి.సి. రోడ్లు, మంచినీటి సదుపాయాలు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.