ఫార్మసీ రంగంలో రాణించాలంటే విద్యార్థులు చురుకైన ఐక్యూ కలిగి ఉండాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి. స్వర్ణలత తెలిపారు. బోయినపల్లి లోని అన్నమాచార్య ఫార్మసీ కళాశాల లో బుధవారం విద్యార్థులకు ఐక్యూ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఫార్మసీరంగంలో ఔషధ తయారీలో వినియోగించే వస్తువులు, పరికరాలను ఒక్కొక్కటిగా గుర్తించి వాటిని తిరిగి తమ మేధో శక్తితో అదే క్రమంలో రాసి విద్యార్థులకు సూచించారు.