ఒంటిమిట్ట మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు శనివారం రాయచోటి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పమాలవేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కల్లుగీత మాజీ రాష్ట్ర డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య, దున్నుతల రఘురాం రెడ్డి, మొదుగుల నరసింహులు, అడ్వకేట్ నారాయణ, హరి కొత్తపల్లి మురళీ మోహన్, మామిళ్ల కృష్ణయ్య తదితరులు నాయకులు పాల్గొన్నారు.