వీరబల్లి: మట్లి రేణుక ఎల్లమ్మ గుడిలో చోరీ

80చూసినవారు
వీరబల్లి: మట్లి రేణుక ఎల్లమ్మ గుడిలో చోరీ
వీరబల్లి మండలంలోని మట్లి పంచాయతీలో గల రేణుక ఎల్లమ్మ గుడిలో గురువారం రాత్రి సమయంలో చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం తెల్లవారి స్థానికులు కొందరు ఈ సంఘటనను గుర్తించి వెంటనే రూరల్ సిఐ వరప్రసాద్ కు, స్థానిక ఎస్సై మోహన్ నాయక్ కు తెలియజేశారు. వెంటనే వారు స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు, ఈ సంఘటన విషయంపై గుడి పూజారిని, స్థానికులను విచారించగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్