ప్యారిస్ ఒలంపిక్స్ 2024 లో మన క్రీడాకారులు మరిన్ని పథకాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి పట్టణంలోని తమ క్యాంపు కార్యాలయం నందు అన్నమయ్య జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఇండియా తరఫున వివిధ క్రీడలలో పాల్గొనే క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.