మదనపల్లె మండలం, పిచ్చలవాండ్లల్లెలో రైతు పొలానికి దారి వదలలేదని 2రోజుల క్రితం ఉరేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ కొండయ్య నాయుడు, తాలూకా సీఐ కళా వెంకటరమణ బుధవారం సాయంత్రం తెలిపారు. ఇప్పటికే అనుమానస్పద మృతి కేసు నమోదు చేయగా, దళిత సంఘాలు ఆందోళనతో దారి లేకుండా చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.