అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు రాయచోటి పోలీసులు దొంగతనాల నివారణలో భాగంగా ఎక్కడైతే తాళం వేసి ఉన్నారో వాటిని గుర్తించి సదరు ఇళ్లపై నిఘా ఉంచడం జరుగుతుందని శనివారం పోలీసులు తెలిపారు. రాయచోటి పోలీసులు మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ మీరు ఎక్కడికైనా ప్రయాణించే సమయంలో మీరు మీ యొక్క ఇంటి అడ్రస్సును పోలీస్ స్టేషన్లో తెలియజేసిన ఎడల పోలీస్ సిబ్బంది సదర ఇంటిపై నిఘా పెట్టడం జరుగుతుందని అన్నారు.