తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని ఖబర్దార్ అని తంబళ్లపల్లె టిడిపి ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి శనివారం హెచ్చరించారు. గత వారం తంబళ్లపల్లెలో కత్తిపోట్లకు గురైన టిడిపి సీనియర్ నాయకుడు కృష్ణమూర్తి కుమారుడు గణేష్ ను ఆయన స్వగృహంలో పరామర్శించారు. ఈ సందర్భంగా అతనిపై జరిగిన దాడి విషయాన్ని విచారించి ఆవేదన వ్యక్తం చేశారు. దాడి విషయంలో పోలీసులు స్పందించిన తీరు బాగాలేదని వివరించారు.