ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్

75చూసినవారు
ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్
ఏపీలో మందుబాబులకు ఎక్సైజ్ శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. 4 కంపెనీలు తమ 7 రకాల బ్రాండ్లను రూ.99కే అమ్మేందుకు అనుమతి పొందిన విషయం తెలిసిందే. రూ.99కు దొరికే క్వార్టర్ మద్యం బాటిళ్ల ఉత్పత్తిని పెంచినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ నెలాఖరు నాటికి 2.4 లక్షల మద్యం కేసులు అందుబాటులో తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. పలు చోట్ల రూ.99కి మద్యం లభించకపోవడంతో మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్