ఏపీలో ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు పార్టీకి రాజీనామా చేయగా.. మరికొందరు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. తాజాగా వైసీసీకి జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు రఘురాం సమక్షంలో మున్సిపల్ ఛైర్మన్ పార్టీలో చేరారు. ఛైర్మన్ చేరికతో జగ్గయ్యపేట మున్సిపాలిటీ టీడీపీ వశం కానుంది.