AP: భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ)కి మండలంలోని పెద్దిపాలెం గ్రామానికి చెందిన డా.అనూష యాదవ్ రాజీనామా చేశారు. ఆ పార్టీ తరఫున గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె రాష్ట్ర సమన్వయ సారథిగానూ ఉన్నారు. తన పదవి, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్కు బుధవారం లేఖ పంపారు. తాను ఉన్నత చదువులకు పూర్తి సమయం కేటాయించేందుకే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.