AP: రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ కొనసాగుతోంది. తాజాగా 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపింది. 30 స్థానాల్లో టీడీపీకి 25, జనసేనకు 4, బీజేపీకి 1 కేటాయించింది. త్వరలోనే మిగతా స్థానాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.