AP: రాష్ట్ర సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో ఎస్సీవర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ ప్రతిపాదనలకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణం చేపట్టనున్నారు.