ధరల నియంత్రణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు

75చూసినవారు
ధరల నియంత్రణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు
ఏపీలో ధరల నియంత్రణకు చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. నిత్యావసరాలు, కూరగాయల ధరల తగ్గింపునకు చేపట్టాల్సిన చర్యలపైనా సిఫార్సులు చేయాలని కమిటీకి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, పయ్యావుల కేశవ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్