ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ ఛైర్పర్సన్ జకియా ఖానం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా మండలి ఛైర్మన్కు లేఖ పంపి.. తన రాజీనామా నిర్ణయాన్ని తెలియజేశారు. ఆమె ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అనే అంశంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.