ఏపీ సర్కార్కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. కొత్త డీజీపీ ఎంపికలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదని హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు నేడు ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసింది. తీర్పు విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు హైకోర్టు సూచించింది.