AP: కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలను పొందడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బి.కొత్తకోట ఎంపీడీవో దిలీప్ కుమార్ తెలిపారు. 21 నుంచి 50 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. కుల ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డుతో పాటు సంబంధిత పత్రాలను సమర్పించాలని అన్నారు. అర్హులైన ఎస్సీలు రుణ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.