సీఎం చంద్రబాబు ఇటీవల బటన్ నొక్కడు అంశంపై చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష వైసీపీ ట్రోల్ చేస్తోంది. చంద్రబాబు పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని వైసీపీ ఆరోపిస్తుంది. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే ఇచ్చిన హామీలు అమలు కష్టంగానే ఉందని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా ఆచరణలోకి రాలేదని, కూటమి ప్రభుత్వం మటలతోనే కాలం వెళ్లదీస్తుందని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ మొదలుపెట్టారు.