AP: తిరుమల శ్రీవారి భక్తులకు TTD తీపి కబురు చెప్పింది. ఈనెల 19న ఆగస్టు నెల కోటా ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఉదయం 10 గంటలకు ఆగస్టు నెల కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. 21 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లో నమోదుకు అవకాశం కల్పించింది. ఇక మే 29 ఉదయం 10 గంటలకు జూలై నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవ కోటా టికెట్లను విడుదల చేయనుంది.