టీమిండియా నెక్స్ట్ టెస్ట్ కెప్టెన్ ఎవరనే దానిపై చర్చ జరుగుతున్న వేళ.. మాజీ క్రికెటర్ R. అశ్విన్ కొత్త పేరును ప్రతిపాదించాడు. బుమ్రాతోపాటు, జడేజాను పరిగణలోకి తీసుకోవాలన్నాడు. కెప్టెన్గా ముగ్గురు లేదా నలుగురిని ఎంపిక చేసి వారిని ప్రెజెంటేషన్ ఇవ్వమనాలని తెలిపారు. జట్టుకు సంబంధించి తమ విజన్ను వివరించమని చెప్పాలన్నాడు. ఆస్ట్రేలియాలో ఇలాగే జరుగుతుందని, మనం ఎందుకు అలా చేయొద్దని బీసీసీఐని ప్రశ్నించాడు.