AP: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని 304 మంది అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)లను రోడ్డు, భవనాల శాఖ (R&B) ఉపయోగించుకోవడానికి సీఎం చంద్రబాబు అనుమతించారు. రూ.3200 కోట్లతో రహదారి విస్తరణ, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్న నేపథ్యంలో ఇంజినీర్ల కొరత తీవ్రంగా ఉందని ఉన్నతాధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో సచివాలయ ఇంజినీరింగ్ సిబ్బందిని వినియోగించుకోవాలని సూచించారు.