గత వైఎస్
జగన్ ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అందులోభాగంగా వెంకట్రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడంతోపాటు కేసు నమోదు చేసేందుకు రంగం సిద్దమైంది. గత ప్రభుత్వంలో ఇసుక, బీచ్ శాండ్, బొగ్గు, గనుల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.