బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆలౌటైంది. 4 పరుగులు వెనకబడి ఉంది. వెబ్స్టర్ 57, స్మిత్ 33, సామ్ కొన్స్టాస్ 23, అలెక్స్ కేరీ 21 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3, సిరాజ్ 3 వికెట్లు తీశారు. బుమ్రా, నితీశ్ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 185 పరుగులు చేసిన విషయం తెలిసిందే.