టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం అందరికీ తెలిసిందే. వైసీపీ ఏపీని ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బ తీసింది అని హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చామని అయితే ఆర్ధిక పరిస్థితి తలచుకుంటే భయం వేస్తోంది అని చంద్రబాబు చెప్పారు. తాజాగా శ్రీశైలం పర్యటనలో బాబు ఏపీ ఖజానా ఖాళీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఈ విధంగా కామెంట్స్ చేయడం అంతా ఒక వ్యూహం ప్రకారమే అని అంటున్నారు.