AP: పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. యుద్ధ భూమిలో వీరమరణం పొందిన జవాన్ మురళినాయక్ కుటుంబానికి సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మురళి నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు. తన వంతుగా ఒక నెల జీతాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఈనెల 12న బాలకృష్ణ.. మురళీ నాయక్ స్వగ్రామానికి వెళ్లనున్నారు.