ప్రజా కూటమి ప్రభుత్వం కూడా చీరాల నియోజకవర్గంలో రేషన్ మాఫియాకు పగ్గాలు వేసే స్థితిలో లేనట్లు కనిపిస్తోంది. గతంలో మాదిరే రేషన్ మాఫియా తన కార్యకలాపాలు సాగిస్తోంది. బుధవారం రాత్రి దండుబాట లోని ఒక రేషన్ షాపు నుండి రేషన్ బియ్యం తరలిపోయిందనే సమాచారంతో డి. టి అక్కడికి వెళ్లి హడావిడి చేయగా అతడిని రేషన్ మాఫియా ప్రసన్నం చేసుకుందని, దీంతో అక్కడ తగ్గిన బియ్యాన్ని మరోచోట నుండి తెప్పించి సర్దుబాటు చేశారని బోగట్టా.