రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వనికి దళితుల సంక్షేమంపై ఏమాత్రం శ్రద్ద లేదని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు అన్నారు. చీరాలలోని దళిత మహాసభ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో నాగేంద్ర మాట్లాడుతూ, మహిళా దినోత్సవం రోజు లక్ష మంది మహిళలకు కుట్టు శిక్షణను ప్రారంభించిన కూటమి ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ మహిళలకు అవకాశం కల్పించకపోవడం కుల వివక్షేనని మండిపడ్డారు.