గిద్దలూరు పరిసర ప్రాంతాలలో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని శుక్రవారం స్థానిక ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో విచ్చలవిడిగా ట్రాక్టర్లతో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని సంబంధిత అధికారులు తెలిసిన పట్టించుకోవటం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు.