భర్తను హత్య చేసిన భార్య

74చూసినవారు
కారంపూడి మండలం పేట సన్నగండ్ల పరిధిలోని తండాలో బుధవారం దారుణ ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. తండాకు చెందిన హనీమి బాయ్ భర్త గోపి నాయకన్ను హత్య చేసిందన్నారు. ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిందని మృతుడి బంధువులు గురువారం ఆరోపిస్తున్నారు. కూల్ డ్రింక్స్ లో గడ్డి మందు కలిపినట్లు పిల్లలు చెబుతున్నారని తెలిపారు. దీంతో గోపినాయక్ కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్