పద్మశాలీయుల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్న సీఎం వైయస్ జగన్ ను ప్రతి ఒక్కరూ ఆదరించి రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెరుకుపల్లి జడ్పిటిసి సభ్యురాలు మర్రివాడ పావని ప్రసాద్ అన్నారు. రేపల్లె వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేష్ ను గెలిపించాలని కోరుతూ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చెరుకుపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పద్మశాలియ సంఘం నాయకులు పాల్గొన్నారు.