దేశవ్యాప్తంగా కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా అమృతలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం తహసీల్దార్ డి. కవిత కు అందజేశారు. రాణి, బుల్లెమ్మ, మీరాబీ, తదితరులు పాల్గొన్నారు.