తెలుగుదేశం పార్టీ అధినేత కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయ కుమార్, ముత్తుముల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ ఛార్జ్ గూడూరి ఏరీక్షన్ బాబు లు సోమవారం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అఖండ విజయం సాదించిన నేపథ్యంలో మొదట అధినేతను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. చంద్రబాబు వారిని ప్రత్యేకంగా అభినందించారు.