ప్రకాశం జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు లు వెలిగొండ ప్రాజెక్టు మరియు గుండ్లకమ్మ ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లా ప్రజలకు నీరు అందించకుంటే జిల్లాకు భవిష్యత్తు ఉండదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గురువారం దోర్నాలలో ఫించన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పింఛనుదారులకు పింఛన్ పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.