AP: కృష్ణా జిల్లా మంగినపూడిలో మే 15 నుంచి బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని శాప్ ఛైర్మన్ రవి నాయుడు తెలిపారు. జాతీయ కబడ్డీ పోటీల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర సూచనలకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. బీచ్ కబడ్డీ, వాటర్ గేమ్స్ నిర్వహణపై సమీక్షించాం. డీఎస్డీవోలు, అసోసియేషన్లకు ఆదేశాలు జారీ చేశాం. క్రీడాస్ఫూర్తి పెంపొందించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని రవి పేర్కొన్నారు.