AP: తిరుపతి గోశాలలో వందలాది గోవులు మరణించాయంటూ ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు నిప్పులు చెరిగారు. ఆదివారం తిరుపతిలో బీఆర్ నాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.. హిందూ వ్యతిరేక అయిన భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డ్ చైర్మన్గా పని చేయడం దురదృష్టకరమన్నారు. ఆయన హిందువే కాదు.. ఆయనవన్నీ వేషాలేనంటూ భూమన కరుణాకర్ రెడ్డిపై మండిపడ్డారు.