త‌ప్పిన పెను ప్ర‌మాదం.. లారీలో మంట‌లు

56చూసినవారు
క‌డప జిల్లాలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. జిల్లాలోని మాధవరం- 1 గ్యాస్ గోడౌన్ వద్ద ఇసుక లారీలో ఆక‌స్మాత్తుగా మంటలు చెల‌రేగాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన లారీ డ్రైవ‌ర్‌, క్లీన‌ర్ సుర‌క్షితంగా ప్రాణాల‌తో బ‌య‌ట‌పడ్డారు. ఈ ప్ర‌మాదంతో కడప- చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్ప‌డింది. రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేసే ప‌నిలో ప‌డ్డారు.

సంబంధిత పోస్ట్