హైకోర్టులో పిన్నెల్లికి భారీ ఊరట

66చూసినవారు
హైకోర్టులో పిన్నెల్లికి భారీ ఊరట
మే 13న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. అతడ్ని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించింది. ఈ క్రమంలో పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌కు దరఖాస్తు చేసుకోగా.. అతడికి కోర్టు బెయిల్ ఇచ్చింది. తాజాగా 4 కేసుల్లో పిన్నెల్లికి హైకోర్టులో ఊరట లభించింది. వచ్చే వారం రోజుల పాటు బెయిల్‌ను పొడిగించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్