ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో 27 ఏళ్ల తర్వాత బీజేపీ కాషాయ జెండాను దేశ రాజధానిలో ఎగురవేసింది. సీఎం, డిప్యూటీ సీఎంలపై బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ బీజేపీ నేత పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన ముగ్గురు నేతలు కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమిని చవిచూశారు.