ఢిల్లీలో బీజేపీ విజయం.. ఏపీలో సంబరాలు

70చూసినవారు
ఢిల్లీలో బీజేపీ విజయం.. ఏపీలో సంబరాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఇటు ఏపీలోనూ సంబరాలు మొదలయ్యాయి. విజయవాడలోని బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. పార్టీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్‌ బాజీ, పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్