ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు.. ఇద్దరు అరెస్ట్

57చూసినవారు
ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్ల ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయిపాలెంకు చెందిన రామ్మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్ 125, 326B కింద కేసు నమోదు చేశారు. గొల్లపూడికి చెందిన ఉషాద్రి పేరుతో మూడు బోట్ల రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. 40-50 టన్నుల బరువున్న బోట్లతో బ్యారేజీని ఢీకొట్టినట్లు గుర్తించారు. నిందితుల కాల్ డేటా, గూగుల్ టేకవుట్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్లాన్ ప్రకారమే ఉద్ధండరాయినిపాలెం నుంచి గొల్లపూడికి బోట్ల తరలించినట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్