ఉత్తరాఖండ్కు చెందిన కేంద్రమంత్రి, మాజీ సీఎం అయిన రమేష్ పొక్రియాల్ నిషాంక్ కుమార్తె ఆరుషి నిషాంక్ను ఇద్దరు బాలీవుడ్ నిర్మాతలు మోసం చేశారు. సదరు నిర్మాతలు ఆమెతో కలిసి ఓ సినిమా నిర్మిద్దామని రూ.6 కోట్లు తీసుకున్నారు. ఆ డబ్బు తీసుకుని ఆమెను మోసం చేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ ఇద్దరిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.