తిరుమల ధర్మగిరి వేద పాఠశాలకి చెందిన విద్యార్థి తివారీ (15) మిస్సయ్యాడు. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అదృశ్యమయ్యాడు. తివారీ సామవేదం అభ్యసిస్తున్నాడు. బాలుడు కనిపించకపోవడంతో వేద పాఠశాల ప్రిన్సిపల్ తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.