అధికారం ఉన్నా లేకున్నా తాము పాలించే రాష్ట్రంలో పార్టీ అధినేతలు ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఏపీలో ఇందుకు వ్యతిరేకంగా జరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చి పోయేవారు. 2024 ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. వైసీపీ అధినేత జగన్ పూర్తిగా బెంగళూరు షిఫ్ట్ అయిపోయారు. వారానికి రెండు మూడు రోజులు అన్నట్లు తాడేపల్లి నివాసానికి వస్తూ పోతున్నారు.