TG: జనగామ జిల్లాలోని దేవరుప్పల మండలం సింగరాజుపల్లి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.