ఏపీలో దీపం పథకం కింద ముందుగానే నగదు చెల్లింపులు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో బుధవారం నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారుల ఖాతాల్లో సిలిండర్ బుకింగ్ కంటే ముందే నగదు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిలో 3 సిలిండర్ల నగదును ఒకేసారి చెల్లించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. లబ్ధిదారులు సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా, సిలిండర్ తీసుకోకపోయినా 3 సిలిండర్ల నగదు ఒకేసారి వారి ఖాతాల్లో వేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.